రెండో పెళ్లాంగా ఏంటండీ.. ఏం పోయే కాలం.. హీరోయిన్ తల్లి షాకింగ్ కామెంట్స్

by Sujitha Rachapalli |
రెండో పెళ్లాంగా ఏంటండీ.. ఏం పోయే కాలం.. హీరోయిన్ తల్లి షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: హీరోయిన్ రవళి, బుల్లితెర స్టార్ హరిత ఇద్దరు అక్కాచెల్లెళ్లు అన్న విషయం చాలా మందికి తెలియదు. రవళి బిగ్ స్క్రీన్ మీద సక్సెస్ అయితే హరిత స్మాల్ స్క్రీన్ పై మెరిసింది. అయితే ఇద్దరు ఆడపిల్లలను ఇండస్ట్రీకి పంపించిన వారి తల్లి.. ఎన్ని జాగ్రత్తలు తీసుకుందో లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 'ఆ టైంలో శ్రీదేవి లాంటి పెద్ద పెద్ద హీరోయిన్లు రెండో భార్యగా కమిట్ అవుతున్నారు. అదో ట్రెండ్ అయిపోయింది అప్పుడు. అందుకే నా పిల్లల్ని ముందుగానే హెచ్చరించాను. ఇలాంటి పనులు చేస్తే కాళ్లు విరగ్గొడుతానని వార్నింగ్ ఇచ్చా. లేదంటే ఇంట్లోనే కుర్చోవచ్చని చెప్పా. అయినా మా ఫ్యామిలీలో ఇలాంటి వాటికి చోటు లేదు ' అని చెప్పుకొచ్చింది.

కాగా శ్రీదేవి.. అప్పటికే మ్యారేజ్ అయిపోయి పిల్లలున్న బోనీ కపూర్ ను పెళ్లి చేసుకుంది. హేమా మాలిని కూడా మిథున్ చక్రవర్తికి రెండో భార్యగా వెళ్లింది. మరో హీరోతో గ్రాండ్ గా మ్యారేజ్ అరేంజ్మెంట్స్ చేస్తామన్నా వినకుండా.. అతన్నే సినిమాటిక్ స్టైల్ లో లవ్ చేసి వివాహం చేసుకుంది. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది కానీ మిథున్ తనతో కాకుండా మొదటి భార్యతోనే ఉండటంతో సింగిల్ మదర్ గానే ఉండిపోయింది. స్ట్రగుల్స్ డీల్ చేస్తూ వారిని పెంచి పెద్ద చేసింది.

Advertisement

Next Story

Most Viewed