బోరున ఏడ్చిన రావు రమేష్

by M.Rajitha |
బోరున ఏడ్చిన రావు రమేష్
X

దిశ, వెబ్ డెస్క్ : విలక్షణ నటుడు రావు రమేష్ బోరున ఏడ్చాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న రావు రమేష్ తను ఎంచుకునే పాత్రలు కూడా ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటారు. రావు రమేష్ ప్రధాన పాత్రలో లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో వచ్చిన మారుతీ నగర్ సుబ్రమణ్యం సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా ఈ చిత్రాన్ని నేడు ప్రేక్షకులతో కలిసి రామనాయుడి స్టూడియోలో చూసిన అనంతరం కన్నీటి పర్యంతం అయ్యారు రావు రమేష్. తన సినిమా కెరీర్లోనే అద్భుతమయిన పాత్ర తనతో చేయించినందుకు డైరెక్టర్ లక్ష్మణ్ ను హత్తుకొని కంటతడి పెట్టారు. మధ్యతరగతికి చెందిన నిరుద్యోగ తండ్రి చుట్టు జరిగే కథాంశంతో వచ్చిన ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు సుకుమార్ భార్య తబిత ప్రొడ్యూస్ చేశారు.

Next Story

Most Viewed