డబుల్ ఇస్మార్ట్ సినిమా రిలీజ్ అయ్యేది అప్పుడే.. మూవీ విడుదలపై క్లారిటీ ఇచ్చిన పూరి జగన్నాథ్!

by Jakkula Samataha |
డబుల్ ఇస్మార్ట్ సినిమా రిలీజ్ అయ్యేది అప్పుడే.. మూవీ విడుదలపై క్లారిటీ ఇచ్చిన పూరి జగన్నాథ్!
X

దిశ, సినిమా : పూరిజగన్నాథ్ దర్శకత్వంలో రామ్‌పోతినేని హీరోగా వస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. ఇప్పటికే ఇస్మార్ట్ శంకర్ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా, డబుల్ ఇస్మార్ట్‌లో రామ్ తన డైలాగ్స్ మాస్ స్టెప్స్‌తో అదరగొట్టనున్నట్లు తెలుస్తోంది. పక్కా హైదరాబాద్ గల్లీ కుర్రాడిలా రామ్ కనిపించనున్నారు. అయితే ఇప్పటికే విడుదలై ఈ మూవీ టీజర్ అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా, ఈ సినిమాపై మరో అప్డేట్ ఇచ్చింది చిత్ర బృదం. మూవీ షూటింగ్ పూర్తైనట్లు మేకర్స్ తెలియజేశారు. డబుల్ ఇస్మార్ట్ టాకీపార్ట్‌తో పాటు మొత్తం షూటింగ్ పూర్తైనట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అంతే కాకుండా ఈ సినిమాను ఆగస్టు15న రిలీజ్ చేయబోతున్నట్లు గతంలోనే తెలిపారు. కాగా, మరోసారి ఈ మూవీ రిలీజ్ పై పూరి జగన్నాథ్ క్లారిటీ ఇచ్చారు. ఆగస్టు 15న పాన్ ఇండియా లెవల్‌లో డబుల్ ఇస్మార్ట్ మూవీ రిలీజ్ చేయనున్నట్లు, మూవీ విడుదల డేట్‌లో ఎలాంటి మార్పు లేదని వారు పేర్కొన్నారు. దీంతో రామ్ అభిమానుల ఆనందం మాటల్లో చెప్పలేకుండా ఉంది. సినిమా విడుదల కోసం వారు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఇక స్కంద మూవీతో కమర్షియల్ ప్లాప్ అందుకున్న రామ్‌‌కు, లైగర్ మూవీతో డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్న పూరిజగన్నాథ్‌కు డబుల్ ఇస్మార్ట్ మంచి సక్సెస్ ఇస్తుందో లేదో చూడాలి అంటున్నారు కొందరు. ఇక ఈ మూవీలో హీరో రామ్ రెమ్యునరేషన్ లేకుండా చేస్తున్నట్లు సమాచారం. సినిమాకు వచ్చిన లాభాల్లో వాటా విధానంలో ఆయన డబుల్ ఇస్మార్ట్ మూవీలో నటించటానికి ఒప్పుకున్నారంట. ఈ మూవీలో హీరోయిన్‌గా కావ్య థాపర్ నటిస్తోంది. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలకపాత్రపోషిస్తున్నాడు.

Advertisement

Next Story

Most Viewed