‘నేను నాన్నతో వెళ్తానన్న ఆద్య’ రేణు దేశాయ్ ఎందుకు ఒప్పుకుందో తెలిస్తే షాక్.. పవన్ కల్యాణ్ మాజీ భార్య సంచలన పోస్ట్

by Anjali |
‘నేను నాన్నతో వెళ్తానన్న ఆద్య’ రేణు దేశాయ్ ఎందుకు ఒప్పుకుందో తెలిస్తే షాక్.. పవన్ కల్యాణ్ మాజీ భార్య సంచలన పోస్ట్
X

దిశ, ఫీచర్స్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇటీవల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. నిన్న ఆమె పెట్టిన ఇన్‌స్టా పోస్ట్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. పవన్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉపముఖ్యమంత్రి పదవిలో ఉండి.. అధికారికంగా జాతీయ జెండా ఎగరవేశారు. ఈ వేడుకల్లో పవన్-రేణు దేశాయ్‌కు జన్మించిన ఆద్య పాప కూడా పాల్గొనడం విశేషం. అయితే స్వాతంత్య్ర దినోత్సవ సెలబ్రేషన్స్ అనంతరం పవన్ కల్యాణ్ తన పాపతో ఓ క్యూట్ సెల్ఫీ దిగారు. ఈ పిక్ నిన్న రేణు దేశాయ్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. జనాల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ పిక్ కు రేణు దేశాయ్..

‘ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ జరుపుకోవడానికి నేను నాన్న దగ్గరికి వెళ్తానని ఆద్య నన్ను అడిగింది. ఒక్కసారిగా షాక్ అయ్యాను. తను అలా అడగడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నా కుమార్తె తన తండ్రితో టైం స్పెండ్ చేస్తుంది. ఒక డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ ఎంత బిజీగా ఉన్నారో అర్థమవుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ జనాలకు పవన్ చేస్తున్న సేవలు ఆద్య తనే స్వయంగా చూడాలి’. అంటూ రేణ దేశాయ్ పోస్ట్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం దీనిపై నెటిజన్లు రేణు దేశాయ్ ది మంచి ఆలోచన అంటూ కొనియాడుతున్నారు. తండ్రి ప్రజల కోసం చేసే సేవలు పిల్లలకు తెలియాలనుకోవడం నిజంగా గ్రేట్ అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed