- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
జైలు కూడు బాగుంది.. అంటూ షాకింగ్ విషయాలు బయటపెట్టిన పల్లవి ప్రశాంత్
దిశ, సినిమా: కామన్ మ్యాన్గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి.. ఎంతో పట్టుదలతో ఆడి విన్నర్గా నిలిచి సెలబ్రిటీగా మారిపోయ్యాడు పల్లవి ప్రశాంత్ . రైతు బిడ్డగా వ్యవసాయ పనులు చేసుకునే పల్లవి ప్రశాంత్ ఇప్పుడు లక్షల మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే ఈ షో గ్రాండ్ ఫినాలే రోజు పెద్ద ఎత్తున ర్యాలీగా వెళుతూ ఆయన అభిమానులు ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ కారణంగా పోలీసులు ప్రశాంత్ పై కేసు నమోదు చేసి ఏకంగా రెండు రోజుల పాటు జైల్లో పెట్టారు.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పల్లవి ప్రశాంత్ మొదటిసారిగా జైలు జీవితం గురించి మాట్లాడాడు.. ‘ మొదటి సారిగా జైల్ ముఖం చూసాను. ఆ రెండు రోజులు నాకు చాలా కష్టంగా గడిచాయి. అన్నం కూడా తినాలనిపించలేదు కానీ తోటి ఖైదీలందరూ బ్రతిమలాడి మరి భోజనం పెట్టారు. అక్కడ నన్ను ఒక వీఐపీలా ట్రీట్ చేసినా చేయకపోయినా జైలు కూడు మాత్రం బాగుంది. ఇక అక్కడ ఖైదీలు నాతో అన్నా అన్నా అంటూ మాట్లాడారు. ఉన్న రెండు రోజుల్లో అక్కడ చాలా విషయాలు నేర్చుకున్నాను. నేనేం తప్పు చేయకపోయినా జైలుకు వెళ్లాల్సి వచ్చింది అందుకే నేను భయపడలేదు. నన్ను విమర్శించిన వారికి కూడా అదే గతి పడుతుంది’ అని తెలిపారు ప్రశాంత్ . ప్రజంట్ అతని మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.