Nagababu-Pawan Kalyan: పవన్ ప్రాయశ్చిత్త దీక్షపై మెగా బ్రదర్ ట్వీట్..!

by Anjali |
Nagababu-Pawan Kalyan: పవన్ ప్రాయశ్చిత్త దీక్షపై మెగా బ్రదర్ ట్వీట్..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం తిరుమల లాడ్డు వివాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా.. లడ్డూ కల్తీ ఘటన గురించే మాట్లాడుకుంటున్నారు. తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ దేవాలయంలో పవన్ మంగళవారం ఉదయం శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. డిప్యూటీ సీఎం ఫస్ట్ గుడి మెట్లను కడిగారు. అనంతరం మెట్లకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి.. కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమం పూర్తయ్యాక పవన్ మీడియాలో మాట్లాడారు.

వైసీపీ నేతలపై దారుణంగా మండిపడ్డారు. సనాతన ధర్మం జోలికి రాకండని, దీనికోసం ప్రాణాలు సైతం ఇవ్వడానికి రెడీ అని, కాగా సనాతన ధర్మంపై నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని ఫైర్ అయ్యారు. ఆయన్ను విమర్శించేవారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తనతో వాగ్వాదానికి దిగుదామనుకుంటే పవన్ రెడీగా ఉన్నానని చెప్పారు. ఈ క్రమంలో తాజాగా పవన్ ప్రాయశ్చిత్త దీక్షపై మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా వేదికపై ఓ ట్వీట్ చేశారు. ‘జగన్ మోహన్ రెడ్డి, ఆయన వైసీపీ ప్రభుత్వం చేసిన పాపాన్ని పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్తం చేసి కడిగేస్తున్నారని’ నాగబాబు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట నెట్టింట వైరల్ అవుతోంది.

Next Story

Most Viewed