- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
ఒకే వేదికపై స్టార్స్.. ఈ అద్భుత దృశ్యం మళ్లీ చూడలేమేమో..
దిశ, సినిమా : ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో, నేడు చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతే కాకుండా ఆయనతో పాటు పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేశారు. కాగా ఈ వేడుకకు సినీ ప్రముఖులు, సూపర్ స్టార్ రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు. దీంతో అభిమానుల ఆనందం మాటల్లో చెప్పలేకుండా ఉంది. ఎందుకంటే ఒకే వేదికపై బాలకృష్ణ, చిరంజీవి, రజినీకాంత్, పవన్ కళ్యాణ్ కనిపించడంతో ఫ్యాన్స్ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ అద్భుతమైన దృష్యాన్ని చూడటానికి రెండు కళ్లు చాలడం లేదు అంటూ వారు తెగ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక వీరే కాకుండా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నాగబాబు, వీరందరూ కూడా వేడుకకు హాజరై ఆ కార్యక్రమాని స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. దీంతో వారందరిని చూసి మెగా ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్, తలైవా ఫ్యాన్స్, దిల్ కుష్ అవుతున్నారు. చంద్రబాబు నాయుడి ప్రమాణ స్వీకారపు వేడుక, స్టార్స్ అందరి కలయికకు వేదికైంది అంటూ పలువురు తమ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా, మొదటి సారి పిఠాపురం నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలుపొందారు, హిందూపురం నుంచి బాలయ్య కూడా మూడో సారి గెలిచిన విషయం తెలిసిందే.