ఒకే ఫ్రేమ్‌లో మెగా బ్రదర్స్.. విభేదాలు ఉన్నా బంధం ప్రత్యేకమైనది.. నాగబాబు ఎమోషనల్ పోస్ట్

by Hamsa |
ఒకే ఫ్రేమ్‌లో మెగా బ్రదర్స్.. విభేదాలు ఉన్నా బంధం ప్రత్యేకమైనది.. నాగబాబు ఎమోషనల్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా హీరో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిల పెళ్లి నవంబర్ 1న ఇటలీలో జరిగిన సంగతి తెలిసిందే. ఇది మెగా ఫ్యామిలీ, ఇరు కుటుంబాలు, పలువురు బంధువుల మధ్య హిందూ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగింది. ఇప్పటికే వరుణ్ – లావణ్య పెళ్ళికి సంబంధించిన పలు ఫొటోలు, మెగా ఫ్యామిలీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పుడు మెగా ఫ్యామిలీ అంతా ఒక్కో ఫొటో షేర్ చేస్తున్నారు. తాజాగా, మెగా బ్రదర్ నాగబాబు తన ఇన్‌స్టాగ్రామ్‌లో తమ ముగ్గురు బ్రదర్స్ చిరంజీవి, పవన్ కల్యాణ్‌‌లతో కలిసి దిగిని పిక్ షేర్ చేశారు.

అలాగే ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా జత చేశారు. ‘‘మా మధ్య విభేదాలు, వాదనలు ఉంటాయి.. అయినా ఈ బంధం ఎంతో ప్రత్యేకమైనది. ఇప్పటి వరకు చేసిన పనులే కాదు.. జ్ఞాపకాలను కలిసే పంచుకున్నాం. మా మధ్య ఉన్న లోతైన బంధం అన్నింటి కన్నా ముఖ్యమైనది. అనేక బలమైన, మధుర జ్ఞాపకాలపై ఈ బంధం ఆధారపడి ఉంది. మా ముగ్గురి విడదీయని బంధానికి నేను మనసారా విలువనిస్తాను’’ అంటూ రాసుకొచ్చారు. ఇందులో పవన్ కల్యాణ్, చిరంజీవిపై చేయి వేసి దిగారు. మెగా బ్రదర్స్‌ను ఒకే ఫ్రేమ్‌లో చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అలాగే హార్ట్ సింబల్స్‌ను కూడా షేర్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. వరుణ్-లావణ్య రిసెప్షన్ నవంబర్ 5న హైదరాబాద్‌లో ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి సినీ సెలబ్రిటీలందరూ హాజరుకానున్నారు.

Read More..

వదినమ్మ వచ్చేసిందంటూ నిహారిక పోస్ట్.. అలాంటి కామెంట్స్ పెడుతూ రచ్చ చేస్తున్న నెటిజన్లు


Advertisement

Next Story

Most Viewed