మండే ఎండ కాలంలో.. మంచులో ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబు ఫ్యామిలీ!

by Disha Web Desk 8 |
మండే ఎండ కాలంలో.. మంచులో ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబు ఫ్యామిలీ!
X

దిశ, సినిమా : ప్రస్తుతం తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఇలాంటి సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ, స్విట్జార్లాండ్‌కి వెళ్లి అక్కడ మంచులో ఏంజాయ్ చేస్తున్నారు. మహేష్ ఫ్యామిలీ ఎక్కువగా వేకేషన్స్‌కు వెళ్తూ ఏంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే వారు స్విట్జర్లాండ్ వెళ్లారు. అక్కడ స్నోరైన్‌లో తడుస్తూ ఉన్న సితార, గౌతమ్ ఫొటోలను నమ్రతా షేర్ చేసింది. అందులో సితార, గౌతమ్ తమ ఫోజులతో నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నారు.

ఇక మహేష్ బాబు షూటింగ్ బిజీలో ఉండటం వలన గౌతమ్, సితార, నమ్రతా ముగ్గురు మాత్రమే స్విట్జర్లాండ్ వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా,వీటిపై నెటిజన్స్ హాట్ సమ్మర్‌లో కూల్ కూల్‌గా ఏంజాయ్ చేస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇక సోషల్ మీడియాలో సితార, గౌతమ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరు ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటిస్తుంటారు.


Next Story

Most Viewed