పద్మశ్రీ అవార్డు గ్రహిత మొగిలయ్యకు కేటీఆర్ సాయం.. నటుడు బ్రహ్మాజీ రియాక్షన్ ఇదే! (పోస్ట్)

by Disha Web Desk 6 |
పద్మశ్రీ అవార్డు గ్రహిత మొగిలయ్యకు కేటీఆర్ సాయం.. నటుడు బ్రహ్మాజీ రియాక్షన్ ఇదే! (పోస్ట్)
X

దిశ, సినిమా: కిన్నెర కళాకారుడు పద్మశ్రీ అవార్డు గ్రహిత మొగిలయ్యకు సంబంధించిన ఓ వీడియో గత కొద్ది రోజులుగా నెట్టింట వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సాయం అందకపోవడంతో.. ఆయన హైదరాబాద్‌లోని ఓ నిర్మాణ స్థలంలో రోజువారి కూలిగా మారడంతో అందరిని కలచి వేసింది. పొట్టకూటి కోసం రోజువారీ కూలిగా మారి జీవనం కొనసాగిస్తున్నట్లు మొగిలయ్య చేసిన కామెంట్లు నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఈ విషయం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరకు వెళ్లింది.

దీంతో ఆయన మొగిలయ్యను కలిసి యోగక్షేమాలు తెలుసుకొని కుటుంబానికి అండగా ఉండి సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఓ పోస్ట్ కూడా చేశారు. ప్రస్తుతం కేటీఆర్ మొగిలయ్యను కలిసిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. తాజాగా, కేటీఆర్, మొగిలయ్యను కలవడంపై టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ స్పందించాడు. ‘‘బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ధన్యవాదాలు. మొగిలయ్యను ఆర్థిక సాయం చేసి అండగా నిలబడిన కేటీఆర్ నిజమైన నాయకుడు. ప్లీజ్ తెలంగాణ సీఎం అనుముల రేవంత్ రెడ్డి మొగిలయ్యను ఆదుకోవాలని రాసుకొచ్చాడు. ప్రస్తుతం బ్రహ్మాజీ పోస్టులు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Next Story

Most Viewed