Jathara Movie: ‘జాతర’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. భారీ హైప్ క్రియోట్ చేసిన ఒక్క డైలాగ్..

by Prasanna |
Jathara Movie: ‘జాతర’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. భారీ హైప్ క్రియోట్ చేసిన ఒక్క డైలాగ్..
X

దిశ, సినిమా : ఈ మధ్య హీరోలు దర్శకులుగా, డైరెక్టర్లు హీరోలుగా మారుతున్నారు. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఇదే ట్రెండ్ నడుస్తుంది. ఇపుడున్న హీరోలలో కొందరు డైరెక్టర్లు అవుదామని సినిమాల్లోకి అడుగుపెట్టి హీరోలయ్యారు. వారిలో హీరో నాని, రాజ్ తరుణ్. తాజాగా డైరెక్టర్ సతీష్ బాబు హీరోగా మారి విభిన్నమైన కథతో మన ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీకి ‘జాతర’ అనే టైటిల్ ప్రకటించి తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసారు.

సినిమా కథ కూడా తనే రాసుకుని డైరెక్షన్ చేయడమే కాక హీరోగా కూడా చేస్తున్నాడు సతీష్ బాబు. గల్లా మంజునాథ్ సమర్పణలో మూవీటెక్ ఎల్‌ఎల్‌సితో కలిసి రాధాకృష్ణ ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ అందర్ని భయపెడుతుంది. జాతర సమయంలో అమ్మవారు కత్తులు ఎలా పట్టుకుంటుందో అలాంటి ఫోజుతో పోస్టర్ అదిరిపోయింది. అంతే కాకుండా ఈ పోస్టర్ మీద రాసిన ఒక్క డైలాగ్ భారీ హైప్ ను క్రియోట్ చేసింది. ‘దేవుడు ఆడే జగన్నాటకంలో.. ఆ దేవునితో మనిషి ఆడించే పితలాటకం’ అంటూ రిలీజ్ కు ముందే అంచనాలను పెంచేశారు. దీంతో ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

Next Story