నేను ఆమెను నమ్మినా.. అందుకే పబ్లిక్‌గా రొమాన్స్ చేశా.. కానీ అందరితో కథలు నడిపి ద్రోహం చేసింది.. సీరియల్ నటితో బ్రేకప్‌పై యంగ్ హీరో

by Dishafeatures3 |
నేను ఆమెను నమ్మినా.. అందుకే పబ్లిక్‌గా రొమాన్స్ చేశా.. కానీ అందరితో కథలు నడిపి ద్రోహం చేసింది.. సీరియల్ నటితో బ్రేకప్‌పై యంగ్ హీరో
X

దిశ, సినిమా : హిందీ 'బిగ్ బాస్ 14' షోలో పబ్లిక్ రొమాన్స్ చేసి పాపులర్ అయిన జంట సమర్థ్ - ఈషా ప్రస్తుతం బ్రేకప్ చెప్పేసుకున్నారు. తనది తప్పంటే తనది తప్పని ఒకరిపై మరొకరు మీడియా ముందు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తన బాయ్ ఫ్రెండ్ గా ఉండే అర్హత తనకి లేదని ఈ సీరియల్ నటి చెప్తుంటే.. మంచిది అంటూనే ముంచే రకమని చెప్తున్నాడు సమర్థ్. అసలు ఆమె క్యారెక్టర్ ఏంటో ఓ ఇంటర్వ్యూలో వివరంగా చెప్పుకు వచ్చాడు. అసలు ఆమెను ఎందుకు కలిసానా అని ఫీల్ అవుతున్నానని బాధపడ్డాడు.

'నిజానికి ఆ అమ్మాయి మంచిదే కానీ ఈగో ఎక్కువ. అమ్మానాన్నను కూడా లెక్క చేయదు. ఒక రిలేషన్ లో ఉన్నప్పుడు మనిషిని చాలా నమ్ముతాం. కానీ ఆమె నా నమ్మకాన్ని వమ్ము చేసింది. అన్ని అబద్ధాలే చెప్పింది. చిన్న చిన్న విషయాల్లో కూడా అలాగే చేసింది. ప్రతి దానికి గొడవ పడింది. అసలు తట్టుకోలేకపోయా. అందుకే విడిపోయా' అని తెలిపాడు. ఇక ఈ ఇష్యూపై స్పందిస్తున్న నెటిజన్లు.. 'అభిషేక్ ను కార్నర్ చేసి బాధపెట్టారు కదా మీకు ఇలాగే జరగాలి' అని కామెంట్స్ చేస్తున్నారు. 'అంతమందితో తిరిగిన అమ్మాయిని నువు మాత్రం ఎట్ల నమ్మావ్ భయ్యా' అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

కాగా బిగ్ బాస్ లో సమర్థ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. అంతకు ముందే ఈషా హౌజ్ లో ఉండగా అభిషేక్ తో రొమాన్స్ స్టార్ట్ చేసింది. సమర్థ్ రాగానే అతను ఫ్రెండ్ లాంటి వాడని ప్లేట్ మార్చేసింది. పాత బాయ్ ఫ్రెండ్ తో ముద్దూముచ్చట కానిచ్చేసింది. అభిషేక్ కు మెంటల్ అనే ఓ ట్యాగ్ లైన్ యాడ్ చేయాలని అనుకుంది కానీ వర్కౌట్ కాలేదు.

Next Story

Most Viewed