పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు చెప్పి బెదిరింపులకి దిగుతున్న హైపర్ ఆది..!

by Kavitha |
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు చెప్పి బెదిరింపులకి దిగుతున్న హైపర్ ఆది..!
X

దిశ, సినిమా: జబర్దస్త్ షో ద్వారా చాలా మంది పాపులారిటీ సంపాదించుకున్నారు. అలా ఫేమస్ అయిన వారిలో హైపర్ ఆది ఒకరు. తన కామెడి టైమింగ్స్‌తో, పంచ్‌లతో నవ్వించి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అదేవిధంగా మొన్న జరిగిన ఎన్నికల్లో పవన్ కోసం పిఠాపురం వెళ్లి అక్కడ కొన్ని రోజులు ఉండి ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా అంటే నేను రియాక్ట్ అవుతాను అంటూ పవన్‌పై తనకు ఉన్న అభమానాన్ని ప్రదర్శించిన విషయం తెలిసిందే. అయితే హైపర్ ఆది పిఠాపురం ఎమ్మెల్యే తాలుకా అంటూ బెదిరించడం నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది.

రీసెంట్‌గా ఢీ షో ప్రోమో రీలీజ్ కాగా ఈ ప్రోమోలో హైపర్ ఆది చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ప్రోమోలో ఆది ఏంట్రా అందరూ బంతి భోజనాలకు కూర్చున్నట్టు కూర్చున్నారు అని చెప్పగా.. పండు ఏంటి నువ్వు కూడా ఛాలెంజ్ మరిచిపోయావా వాళ్ళు వచ్చి కూర్చోవాలి మనం గెలిచాం లాస్ట్ రౌండ్ అని చెబుతాడు. హైపర్ ఆది వెంటనే ఆడవాళ్లు గుళ్లో కూర్చోవాలి కానీ ఒళ్లో కూర్చోవడం ఏంట్రా సిగ్గు లేదా మీకు అంటూ హైపర్ ఆది రియాక్ట్ అయ్యారు. ఆ తర్వాత హైపర్ ఆది నువ్వు ఎలా కూర్చున్నావో తెలుసా. ఫ్యామిలీ ప్లాన్ ఆపరేషన్ అయ్యాక ఆరెంజ్ జ్యూస్ 500 రూపాయల కోసం కూర్చున్నట్టు కూర్చున్నావ్ అని పంచ్ వేయగా ఆ పంచ్ ఆకట్టుకుంది. ఆ తర్వాత పండు నువ్వెన్ని చెప్పినా ఈరోజు తగ్గేది లేదు. అడ్డొస్తే తొక్కి పడేస్తా అని చెప్పగా హైపర్ ఆది వెంటనే మనం ఎవరి తాలూకానో తెలుసా నీకు పిఠాపురం గుర్తుందా అని కామెంట్లు చేశారు.

కాగా ఈ నెల 26వ తేదీన ఫుల్ ఎపిసోడ్ ప్రసారం కానుండగా ఈ షోకు హన్సిక, శేఖర్ మాస్టర్ జడ్జిలుగా వ్యవహరిస్తూ ఉన్నారు.


Next Story

Most Viewed