డిప్యూటీ CM పవన్ కల్యాణ్ సీరియస్.. క్షమాపణలు చెప్పిన హీరో కార్తీ

by Gantepaka Srikanth |
డిప్యూటీ CM పవన్ కల్యాణ్ సీరియస్.. క్షమాపణలు చెప్పిన హీరో కార్తీ
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల లడ్డూ అంశంపై సినిమా ఫంక్షన్‌లో హీరో కార్తీ(Karthi) చేసిన వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) సీరియస్ అయిన సంగతి తెలిసిందే. లడ్డూ పవిత్రను దెబ్బతీసేలా కార్తీ మాట్లాడారని, తీరు మార్చుకోవాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. యాక్టర్‌గా మీరంటే తనకు ఎంతో గౌరవమని.. కానీ, ఏదైనా అంశంపై మాట్లాడేముందు వందసార్లు ఆలోచించుకోవాలని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. తాజాగా.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై హీరో కార్తీ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా ట్వీట్ పెట్టారు.

‘డియర్ పవన్ కల్యాణ్ సర్. మీరంటే నాకు ఎంతో గౌరవం. నా వ్యాఖ్యలపై అనుకోని అపార్థం ఏర్పడినందుకు క్షమాపణ చెబుతున్నాను. వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను ఎప్పుడూ సంప్రదాయాలను గౌరవిస్తాను’ అని కార్తీ నెట్టింట్లో పేర్కొన్నారు. కాగా, కార్తీ ప్రధాన పాత్రలో నటించిన ‘సత్యం సుందరం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో యాంకర్ కార్తీతో మాట్లాడుతూ.. ‘లడ్డూ కావాలా నాయనా’ అని అడిగారు. అందుకు కార్తీ స్పందిస్తూ.. లడ్డూ టాపిక్ వద్దని.. ఇప్పుడు ఆ అంశం సెన్సిటివ్ టాపిక్ అని అన్నారు. కార్తీ చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించి సీరియస్ అవడంతో కార్తీ క్షమాపణ చెప్పారు.

Next Story

Most Viewed