Guppedantha Manasu : నేను ఏ నేరం చేయలేదు.. నన్ను నమ్మండి అంటున్న మను

by Disha Web Desk 10 |
Guppedantha Manasu : నేను ఏ నేరం చేయలేదు.. నన్ను నమ్మండి అంటున్న మను
X

దిశ, సినిమా: గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్

మనుని చూడటానికి మహేంద్ర, అనుపమ, వసుధారలు స్టేషన్‌కి వద్దకి వెళ్తారు. అయితే, అనుపమ స్టేషన్ బయటే ఆగిపోతుంది.. ‘నేను వాడిని అలా చూడలేను.. స్టేషన్‌లో నా కొడుకు ఉన్న పరిస్థితి చూసి అస్సలు తట్టుకోలేను.. అందరి ముందు వాడు తలదించుకుని ఉండటం నేను అసలు చూడలేను.. నా వల్ల కాదంటూ ’ అని స్టేషన్ బయటే అనుపమ ఆగిపోతుంది. ఇక స్టేషన్‌కి వెళ్లేసరికి మను బాధ పడుతూ ఉంటాడు. మహేంద్ర కంగారుగా వెళ్లి.. ‘మనూ.. అసలు ఏమి జరిగింది? నువ్వు ఆ రాజీవ్‌ని కాల్చావా? అని మను అడుగుతాడు. దాంతో మను.. నేను రాజీవ్‌ని కలిసిన మాట నిజమే.. ఆ రాజీవ్‌తో గొడవ పడిన మాట కూడా నిజమే.

తను నాకు ఫోన్ చేస్తే వెళ్లాను తప్పితే.. నా అంతటగా నేను అక్కడికి వెళ్లలేదు. అసలు రాజీవ్.. చనిపోయాడో లేదో కూడా తెలియదు. దత్తత జరిగే వద్దకు .. పోలీసులు వచ్చి చెప్పే వరకు నాకు ఆ విషయం గురించి తెలియదు’ అని మను అంటాడు. ఇంతలో ఎస్ఐ వచ్చి.. ‘వావ్.. ఆపు ఇంకా నాటకాలు బాగానే ఆడుతున్నావ్ కదా.. తప్పు చేసిన వాళ్లు ఇలాగే ఏమి తెలియనట్టు మాట్లాడతారు. దొంగ ఎవరూ దొంగతనం ఒప్పుకోడు.. ఇప్పుడు నువ్వు కూడా అదే చేస్తున్నావ్ అని అంటాడు. ఒక మనిషిని చంపేసి.. ఏం తెలియనట్టు ఇక్కడికి వచ్చాడు అని కా’ అని అంటాడు. ఇక్కడితో ఈ సీన్ ముగుస్తుంది.



Next Story

Most Viewed