- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బాలికని తాళ్లతో కట్టి వ్యభిచార కూపంలోకి...
దిశ, జూబ్లిహిల్స్ : కూతురిలా పెంచాల్సిన దత్తత తీసుకున్న తల్లి ఆమెను బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న ఘటన జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే యూసుఫ్ గూడలోని కృష్ణానగర్ లో నివాసం ఉండే లక్ష్మి, ఆమె భర్త కొన్నేళ్ల క్రితం ఒక పాపను దత్తత తీసుకున్నారు. పాపకు నేడు 14 ఏళ్లు వచ్చాయి. అయితే దత్తత తీసుకున్న తల్లి లక్ష్మి బాలికను గత రెండు సంవత్సరాలుగా తాడుతో కట్టేసి బలవంతంగా వ్యభిచారం చేయిస్తుంది.
బాలిక ఫిర్యాదు మేరకు వ్యభిచార రొంపి నుంచి జూబ్లిహిల్స్ పోలీసులు కాపాడారు. అనంతరం బాలిక మాట్లాడుతూ...నిర్వాహకురాలు చిన్నప్పుడే తనను తీసుకొచ్చి పెంచిందని, రెండేళ్ల నుంచి బలవంతంగా వ్యభిచారం చేయిస్తుందని తెలిపింది. తాను ఒప్పుకోకపోతే తీవ్రంగా కొట్టి తాడుతో కట్టేసి వ్యభిచారం చేయిస్తుందని ఏడుస్తూ చెప్పింది. అనంతరం పోలీసులు బాలికను సురక్షిత ప్రాంతానికి తరలించారు. నిర్వాహకులు లక్ష్మి తదితరులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.