Megastar Chiranjeevi: గద్దర్‌ అవార్డ్స్‌ వేడుక ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి: మెగాస్టార్‌ చిరంజీవి

by sudharani |
Megastar Chiranjeevi: గద్దర్‌ అవార్డ్స్‌ వేడుక ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి: మెగాస్టార్‌ చిరంజీవి
X

దిశ, సినిమా: తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని నటీనటుల్లో, సాంకేతిక నిపుణుల్లో ఉత్తమ ప్రతిభను చూపినవారికి ఇచ్చే నంది అవార్డుల వేడుక దాదాపు గత 10 సంవత్సరాలుగా నిర్వహించడం లేదు. ప్రత్యేక తెలంగాణ రాష్రం ఏర్పడిన తరువాత నంది అవార్డుల వేడుకను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించలేదు. అయితే తాజాగా నంది అవార్డుల స్థానంలో, సినిమా అవార్డులను పునరుద్ధరిస్తూ ప్రజా కళాకారుడు స్వర్గీయ గద్దర్‌ పేరు మీదుగా ప్రతి యేటా గద్దర్‌ అవార్స్డ్‌ ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రేవంత్‌ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయానికి తెలుగు పరిశ్రమ తరపున , ఫిలిం ఛాంబర్‌, నిర్మాతల మండలి ఈ ప్రతిపాదనను ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకవెళ్లేలా బాధ్యత తీసుకోవాల్సిందిగా మెగాస్టార్‌ చిరంజీవి కోరారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్‌ వేదికగా స్పందించారు

Advertisement

Next Story