రీ రిలీజ్ ట్రెండ్ తీసుకొచ్చి బాక్సాఫీసును బద్దలు కొట్టిన ఫస్ట్ టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?

by Hamsa |   ( Updated:2023-08-29 09:35:40.0  )
రీ రిలీజ్ ట్రెండ్ తీసుకొచ్చి బాక్సాఫీసును బద్దలు కొట్టిన ఫస్ట్ టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రీరిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. నిత్యం ఏదో మూవీ రీరిలీజ్ అవుతూ థియేటర్స్‌లో సందడి చేస్తున్నాయి. స్టార్ హీరోల చిత్రాలు, ఇంతకు ముందు రిలీజ్ అయి బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టినవి కూడా రీరిలీజ్‌లో భారీ కలెక్షన్స్‌ను సాధిస్తూ రికార్డ్ సృష్టిస్తున్నాయి. దీంతో ఫ్యాన్స్ సైతం తమ అభిమాన హీరో సినిమాను మళ్లీ మళ్లీ చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. థియేటర్స్‌లో కొత్త సినిమాల కంటే ఇంతకు ముందు రీరిలీజ్ అవుతూ ట్రెండ్ సెట్ చేస్తున్నాయి.

ఇటీవల విడుదలైన బిజినెస్ మ్యాన్, సింహాద్రి, ఖుషి, నెంబర్ 1, పోకిరి, జల్సా, బిల్లా, ఒక్కడు, ఆరెంజ్, దేశముదురు, సూర్య % కృష్ణ రీరిలీజ్ అయి కలెక్షన్స్‌తో పాటు ప్రేక్షకులను మెప్పించాయి. అయితే అసలు ఈ రీ రిలీజ్ ట్రెండ్ ఏ హీరో సినిమాతో మొదలైందో తెలిసి ఆ హీరో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్‌ మొట్టమొదటి సారి సూపర్ స్టార్ మహేష్ బాబు పోకిరి ఆగస్టు 9వ తేదీన 2022 లో ఈ సినిమాతో స్టార్ట్ అయింది. ఇప్పుడు కూడా రీరిలీజ్‌కు చాలా సినిమాలే లిస్ట్‌లోకి చేరాయి.

Advertisement

Next Story

Most Viewed