రేపు చిరంజీవి, రామ్ చరణ్, NTR, మహేష్ బాబు ఓటు వేసేది ఇక్కడే!

by GSrikanth |
రేపు చిరంజీవి, రామ్ చరణ్, NTR, మహేష్ బాబు ఓటు వేసేది ఇక్కడే!
X

దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు పకడ్బంధీ ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రం పరిసరాల్లో 144 సెక్షన్ విధించడంతో పాటు పోలీసుల చేత భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రముఖులు, నగరాల్లో స్థిరపడిన వాళ్లు గ్రామాలకు బయలుదేరారు. ఈ క్రమంలో సెలబ్రెటీలకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, NTR, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, మోహన్ బాబు ఫ్యామిలీ ఓటు హక్కు వినియోగించుకునే పోలింగ్ కేంద్రాల్లో మరింత బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. జూబ్లీహిల్స్‌ క్లబ్‌‌లో మొత్తం ఫ్యామిలీతో పాటు చిరంజీవి, రాంచరణ్, ఓబుల్‌రెడ్డి స్కూల్‌‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌, ప్రణతి.. బీఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్‌ జూబ్లీహిల్స్‌లో అల్లు అర్జున్, స్నేహారెడ్డి, అల్లు అరవింద్, అల్లు శిరీష్‌.. జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌‌లో మహేశ్‌బాబు, నమ్రత, మంచు మోహన్‌బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్‌, విజయ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ, శ్రీకాంత్‌, జీవిత, రాజశేఖర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.



Next Story