Prabhas : సైలెంట్‌గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొడతాం.. ప్రభాస్ లేటెస్ట్ మూవీపై నిర్మాత కామెంట్స్

by sudharani |   ( Updated:2024-08-23 14:33:40.0  )
Prabhas : సైలెంట్‌గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొడతాం.. ప్రభాస్ లేటెస్ట్ మూవీపై నిర్మాత కామెంట్స్
X

దిశ, సినిమా: రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రాల్లో ‘రాజసాబ్’ ఒకటి. డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే.. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి అప్‌డేట్స్ సరిగ్గా ఇవ్వకపోవడంతో.. అసలు మూవీ ఉందో లేదో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్ అండ్ ప్రేక్షకులు. ఈక్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మూవీపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

‘‘రాజాసాబ్’ను స్టార్ట్ చేసినప్పుడు ప్రభాస్ వేరే సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందుకే రాజాసాబ్ చిత్రీకరణ్ సైలెంట్‌గా జరురుగోతంది. ఇది చాలా పెద్ద సినిమా. 38,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో సెట్ ఏర్పాటు చేశాం. ఇండియాలో ఇప్పటివరకు ఇంత భారీ సెట్ ఏ మూవీకి వెయ్యలేదు. సినిమాలో వీఎఫ్‌ఎక్స్ ఎఫెక్ట్‌లకు కూడా పెద్దపీట వేశాం. రొమాంటిక్, హారర్, యాక్షన్ అన్ని ఎలిమెంట్స్ రాజాసాబ్‌లో ఉంటాయి. ఫైనల్‌గా సైలెంట్‌గా వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ కొడతాం’ అంటూ చెప్పుకొచ్చారు నిర్మాత.

Advertisement

Next Story