నిజంగానే ఎంగేజ్‌మెంట్ చేసుకున్న బిగ్‌బాస్ లేడీ టైగర్? త్వరలోనే పెళ్లి!!

by Anjali |
నిజంగానే ఎంగేజ్‌మెంట్ చేసుకున్న బిగ్‌బాస్ లేడీ టైగర్? త్వరలోనే పెళ్లి!!
X

దిశ, సినిమా: మా టీవీలో ప్రసారమయ్యే ‘కార్తీక దీపం’ సీరియల్‌లో విలన్ పాత్రలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది శోభా శెట్టి. ఈ అమ్మడు మోనిత గానే బుల్లితెర ప్రేక్షకులను బాగా తెలుసు. విలన్ పాత్రలో అద్భుతంగా నటించినందుకు శోభా అవార్డు కూడా సొంతం చేసుకుంది. రీసెంట్‌గా నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన తెలుగు బిగ్‌బాస్ సీజన్-7 లో హౌస్‌లోకి కంటెస్టెంట్‌‌గా పాల్గొని ఆడియన్స్‌ను అలరించింది. మగాళ్లతో సమానంగా ఆడి తన సత్తా ఏంటో నిరూపించుకుంది.

డేరింగ్ అండ్ డాషింగ్ మాటలతో తోటి కంటెస్టెంట్లకు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తూ తనకంటూ సొంత ఇమేజ్‌ను క్రియేట్ చేసకుంది. కానీ ఈ అమ్మడు బిగ్‌బాస్ హౌస్‌కు వెళ్లాక కాస్త నెగిటివినీ కూడా తెచ్చుకుంది. అయితే ‘కార్తీక దీపం’ సీరియల్‌లో తనతో పాటు డాక్టర్ బాబు తమ్ముడిగా నటించిన యశ్వంత్ రెడ్డితో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. రీసెంట్‌గానే శోభా.. యశ్వంత్‌తో ప్రేమలో ఉన్నట్లు ప్రకటించింది. వీరికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి.

ఇటీవల శోభా తన యూట్యూబ్ చానల్‌లో షేర్ చేసిన వీడియో చూసి అందరూ వీరిద్దరికి ఎంగేజ్‌మెంట్ జరిగిందని భావించారు. కానీ తాజాగా ఈ నటి నిజంగానే ఎంగేజ్‌మెంట్ చేసుకుని ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఇక త్వరలోనే శోభా శెట్టి-యశ్వంత్ రెడ్డి ఎంగేజ్‌మెంట్ చేసుబోతున్నట్లు తెలస్తుంది. దీనిపై రీసెంట్‌గా శోభా స్పందించి.. పెళ్ళి మాత్రం తన ఇష్టపూర్వకంగా ఎంతో ఘనంగా జరుపుకుంటానని తెలిపినట్లు సోషల్ మీడియాలో జనాలు చర్చించుకుంటున్నారు.



Advertisement

Next Story

Most Viewed