ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన అనుపమ.. చాలా థ్రిల్లింగ్‌గా ఉందంటూ అతని ఫొటో షేర్ చేసిన బ్యూటీ!

by Disha Web Desk 6 |
ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన అనుపమ.. చాలా థ్రిల్లింగ్‌గా ఉందంటూ అతని ఫొటో షేర్ చేసిన బ్యూటీ!
X

దిశ, సినిమా: కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి యూత్ కలల రాణిగా మారిపోయిందనడంలో అతిశయోక్తి లేదు. టాలీవుడ్‌లో వరుస చిత్రాల్లో నటిస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుంటుంది. ఇటీవల అనుపమ సిద్దు జొన్నలగడ్డ సరసన టిల్లు స్క్వేర్-2లో నటించి మెప్పించింది. ఈ చిత్రం భారీ విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఇన్నాళ్లు అనుపమ రొమాంటిక్ సీన్స్ నటించకుండా ఫ్యామిలీ సినిమాలే చేసింది.

ఇక టిల్లు స్క్వేర్‌లో ఈ అమ్మడు బోల్డ్ సీన్స్‌లో రెచ్చిపోయి నటించడంతో.. విమర్శలు ఎదుర్కొంది. కానీ సినిమా హిట్ కావడంతో అంతా ఫుల్ ఖుషీ అయ్యారు. ఫ్యాన్స్ మాత్రం అలా ఇంకోసారి చేయకండి అని ఆమెను వేడుకున్నారు. అలాగే అవకాశాలు రావని అనుకున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, అనుపమ పరమేశ్వరన్ తన ఇన్‌స్టా్గ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టి గుడ్ న్యూస్ తెలిపింది. తమిళ మూవీలో ఆఫర్ వచ్చినట్లు ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేసింది. తమిళ డైరెక్టర్ సెల్వరాజ్, విక్రమ్ ధ్రువ్ కాంబోలో వస్తున్న మూవీలో ఆమె హీరోయిన్‌గా చేస్తుంది.

ఈ మూవీకి బైసన్ కాలమందన్ అనే టైటిల్‌తో రాబోతుంది. ఈ విషయాన్ని తెలుపుతూ అనుపమ.. ఈ ప్రాజెక్ట్‌లో జాయిన్ అవుతున్నందుకు చాలా థ్రిల్లింగా ఉంది. సెల్వ రాజ్ సార్‌కు ధన్యవాదాలు. ఈ సాహస యాత్రలో నన్ను తీసుకెళ్లినందుకు. ధ్రువ్ విక్రమ్‌కు శుభాకాంక్షలు. అన్ని కష్టాలూ అంతంతమాత్రంగానే ఫలిస్తాయి! అన్ని తుపాకులు జ్వలిస్తూ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయి.. షూటింగ్ ఇప్పుడు ప్రారంభమవుతుంది’’ అంటూ రాసుకొచ్చింది. అంతేకాకుండా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రివీల్ చేసింది. దీంతో ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆమెకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.

Read More...

Anupama Parameswaran :లేడీ ఓరియెంటెడ్ సినిమాలో అనుపమ.. ‘లాక్ డౌన్’ ఫస్ట్ లుక్


Next Story

Most Viewed