- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
- ప్రపంచం
పవన్ కళ్యాణ్ గెలుపుపై అనసూయ క్రేజీ కామెంట్స్..ఇది ఆరంభం మాత్రమే అంటూ పోస్ట్!
దిశ, సినిమా : యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ నటి అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. అయితే ఈ నటి ఎక్కువగా పలు నటీనటులకు కౌంటర్ ఇస్తూ ఉంటుంది. అయితే తాజాగా అనసూయ పాలిటిక్స్ పై స్పందించింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన విజయంపై అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
అయితే తాను విజయం సాధించిన మొదటి సారి పవన్ కళ్యాణ్ చిరు ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ తన అన్నయ్య చిరంజీవి కాళ్ళకు నమస్కరించి ఎమోషనల్ అయ్యారు. అలాగే కుటుంబసభ్యులతో ఆయన తన సంతోషాన్ని పంచుకున్నారు. మెగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ పవన్కు విషెస్ చెప్పి, కేక్ కట్ చేయించారు. ఇక చిరు ఇంట్లో ఆ రోజు ఉన్న సందడే వేరు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో అనసూయ ఆవీడియోను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ.. ఇది కేవలం ఆరంభం మాత్రమే.. నాయకుడు వచ్చాడు.. పవర్లో పవర్ స్టార్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇదే నిజమైన ప్రేమ అంటూ చిరు, పవన్ మధ్య అనుబంధాన్ని తెలియజేస్తూ పోస్ట్ చేసింది. ఇక ప్రస్తుతం అనసూయ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక అనసూయ భరద్వాజ్ యాంకర్గా జబర్ధస్త్లోకి అడుగు పెట్టి మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తన నటనతో అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పుష్ప2లో దాక్షాయణి ప్రాత చేస్తున్న విషయం తెలిసిందే.