ఆ హీరోతో రొమాన్స్ తర్వాత ఒళ్లంతా దద్దుర్లు వచ్చాయి.. యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

by Disha Web Desk 7 |
ఆ హీరోతో రొమాన్స్ తర్వాత ఒళ్లంతా దద్దుర్లు వచ్చాయి.. యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావు హైదరీ, శృతి శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన సిరీస్ ‘హీరామండి’. సూపర్ సక్సెస్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సిరీస్.. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధిక వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఇక ఈ సిరీస్‌లో సైమా అనే పాత్రలో నటించిన శృతి శర్మ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సిరీస్ చిత్రీకరణలో తనకు ఎదురైన అనుభవాలను తెలిపింది.

ఆమె మాట్లాడుతూ.. ‘ఇందులో రజత్ కౌల్‏తో నాకు కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. ఆ రొమాంటిక్ సీన్‌లో ఇద్దరం చాలా సహజంగా నటించాము. ఇప్పటి వరకు అలాంటి సన్నివేశాలు నేను ఎప్పుడు చెయ్యలేదు. దుమ్ము, ధూళి ఎక్కువగా ఉన్నప్పటికీ ఒక రోజంతా కష్టపడి ఆ సీన్స్ కంప్లీట్ చేశాము. కానీ ఆ రొమాంటిక్ సీన్స్ చేస్తున్న సమయంలో నా శరీరంపై దద్దుర్లు వచ్చాయి’ అంటూ చెప్పుకొచ్చిన బ్యూటీ.. ‘‘హీరామండి’ వెబ్ సిరీస్‌లో సైమా పాత్ర చేయడం పట్ల చాలా సంతోషంగా ఉన్నానని.. డైరెక్టర్ భన్సాలీ ఊహించుకున్న రోల్ కోసం ఎంతో కష్టపడ్డానని’ తెలిపింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed