Tollywood : టాలీవుడ్లో కొత్త ట్రెండ్.. మొదటి పెళ్లి కంటే రెండో పెళ్లే ముద్దంటున్న సెలెబ్రెటీలు..

by Prasanna |
Tollywood : టాలీవుడ్లో కొత్త ట్రెండ్.. మొదటి పెళ్లి కంటే రెండో పెళ్లే ముద్దంటున్న సెలెబ్రెటీలు..
X

దిశ, సినిమా : ఈ మధ్య సెలబ్రిటీలు ప్రేమించి పెళ్లి చేసుకోవడం ట్రెండ్ అయిపోయింది. అక్కడి వరకు బాగానే ఉంటే ఓకే.. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ఒకరినొకరు అర్ధం చేసుకోలేక చిన్న దానికే విడిపోతున్నారు. ఇలా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది నటీ నటులు వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. ఇలా మధ్యలో డివోర్స్ తీసుకున్న నటీ నటులు మొదటి పెళ్లి కంటే రెండో పెళ్లే ముద్దంటూ మళ్ళీ వేరే వాళ్ళతో కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్నారు. ఆ సెలబ్రిటీలెవరో ఇక్కడ చూద్దాం..

నాగ చైతన్య

హీరో నాగచైతన్య, సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ 2017 లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల నాలుగేళ్లకు డివోర్స్ ప్రకటించారు. కట్ చేస్తే నేడు నాగచైతన్య , శోభిత దూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకున్నారు. తండ్రి బాటలోనే నాగచైతన్య రెండవ వివాహం చేసుకోబోతున్నడని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మంచు మనోజ్

మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్ కూడా రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి పెళ్లి ప్రణతి రెడ్డి అనే అమ్మాయితో జరిగింది. వీరిద్దరూ రెండేళ్లు కూడా కలిసి ఉండలేకపోయారు. గొడవలు కారణంగా ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత మనోజ్ భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా మౌనికను లవ్ మ్యారేజ్ చేసుకుని సంతోషంగా ఉన్నాడు.

Advertisement

Next Story

Most Viewed