భర్త మరో మహిళతో వెళ్లాడని..

by  |
భర్త మరో మహిళతో వెళ్లాడని..
X

దిశ, వెబ్‌డెస్క్ : 'ఏపీలోని కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ఓ తల్లి తన కూతురును నీటి కుంటలో తోసేసి, తానూ అందులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జిల్లాలోని ఆలూరులో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. తన భర్త వేరే మహిళతో వెళ్లిపోవడంతో భార్య మనస్తాపానికి గురైంది.

ఈ నేపథ్యంలోనే కూతురు జ్ఞానేశ్వరిని మొదట నీటి కుంటలో తోసి, తల్లి శిల్ప కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న అందుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వారు వెల్లడించారు.


Next Story