కొత్త స్కీమ్‎ను అందుబాటులోకి తీసుకురానున్న మోదీ సర్కారు..!

by  |
కొత్త స్కీమ్‎ను అందుబాటులోకి తీసుకురానున్న మోదీ సర్కారు..!
X

దిశ వెబ్‎డెస్క్: కేంద్ర ప్రభుత్వం మరో పథకాన్ని అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. పెన్షన్ ఫండ్ రెగ్యూలేటరీ అండ్ డెవలప్‎మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్‎డీఏ) అనే కొత్త పెన్షన్ స్కీమ్‎ను తీసుకొస్తున్నట్లు చైర్మన్ సుప్రతిమ్ బందోపాధ్యాయ్ వెల్లడించారు. ఈ స్కీమ్ ద్వారా ఖచ్చితమైన రాబడి అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ విషయంపై పెన్షన్ ఫండ్స్, ఇతర సంస్థలతో చర్చలు జరుపుతున్నామని.. ఈ స్కీమ్‎ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నారు.

ఈ స్కీమ్‎లో చేరిన వారికి ఖచ్చితంగా ఎంత వరకు రాబడి అందించొచ్చనే అంశంపై ఫండ్ మేనేజర్లతో చర్చిస్తున్నట్లు బందోపాధ్యాయ చెప్పుకొచ్చారు. ఈ పీఎఫ్ఆర్‎డీఏ స్కీమ్ ప్రకారం.. సబ్‎స్క్రైబర్లు ప్రతి నెలా కొంత మొత్తాన్ని చెల్లించాలి. మూడు నెలలు, ఆరు నెలలకు కూడా డబ్బులు కట్టొచ్చు. ఇలా నిర్ణీత కాలం వరకు చెల్లించిన తర్వాత 60 ఏళ్ల నుంచి పెన్షన్ పొందవచ్చు.


Next Story

Most Viewed