జమిలి ఎన్నికలొస్తే జగన్ ​ఇంటికే : నారా లోకేష్

by srinivas |
జమిలి ఎన్నికలొస్తే జగన్ ​ఇంటికే : నారా లోకేష్
X

దిశ, ఏపీబ్యూరో : జమిలి ఎన్నికల్లో జగన్ ఇంటికి వెళ్లడం ఖాయమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పారు. మంగళవారం ఆయన ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మేడపిలో నివర్ తుఫాను ప్రభావంతో నష్టపోయిన మిర్చి రైతులతో మాట్లాడారు. భారీ వర్షాలకు ఎకరాకు లక్షల్లో నష్టపోయినట్లు రైతులు వాపోయారు.

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ సీఎం జగన్ రెడ్డి గాల్లో తిరుగుతాడు.. వ్యవసాయ శాఖ మంత్రి రికార్డింగ్ డాన్సులు చూస్తాడు. ఏపీలో ఇంత దరిద్రపు పాలన ఎప్పుడు చూడలేదని వ్యాఖ్యానించాడు. అసెంబ్లీలో చంద్రబాబు ప్రశ్నిస్తేనే రైతులకు ఇన్సూరెన్స్ డబ్బులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. అధికారం లోకి వచ్చిన తర్వాత మాట తప్పడం, మడమ తిప్పవడం తప్ప ఆయన చేసిందేమీ లేదని విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed