‘జగన్ దేవుడు.. అందుకే గుడి..’

by Anukaran |   ( Updated:2021-08-15 05:15:32.0  )
‘జగన్ దేవుడు.. అందుకే గుడి..’
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు సంతోషించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, జగన్ కు గుడికట్టారు. సీఎం జగన్ ప్రవేశపెడుతున్న నవరత్రాల పేరుతో ఈ ఆలయాన్ని నిర్మించడం విశేషం. రైతు భరోసా, పెన్షన్లు, ఆరోగ్యశ్రీ, అమ్మఒడి వంటి పేర్లతో భారీ స్థూపాలు ఏర్పాటు చేశారు.

అంతేకాకుండా ఫీజు రియంబర్స్‌మెంట్స్, ఇండ్లు, జలయజ్ఞం పేర్లతో స్థూపాలను నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణానికి సుమారు 2 కోట్ల ఖర్చు అయినట్లు తెలుస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్న సీఎం జగన్ దేవుడని అందుకే గుడి కడుతున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement

Next Story