ఐ మిస్ యూ.. వీడని మిస్టరీ

by  |

దిశ, వెబ్‌డెస్క్: నిత్యం స్నేహితులతో తిరుగుతు.. ఇంటికి ఆలస్యంగా వస్తున్నాడని తల్లిదండ్రులు మందలించడంతో ఓ యువకుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. వెళ్లే ముందు తన స్నేహితుడికి చివరి సారిగా ఐ మిస్ యూ అని మేసేజ్ చేశాడు. ఆ తర్వాత అతడు ఎక్కడికి వెళ్లాడో ఓ మిస్టరీగా మారింది.

క‌ృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం అవుటపల్లికి చెందిన రమేశ్ ఇంజనీరింగ్ ఫస్టీయర్ చదువుతున్నాడు. అయితే, నిత్యం తన స్నేహితులతో గడిపేవాడు. రాత్రి ఇంటికి ఆలస్యంగా వచ్చేవాడు. దీంతో తల్లిదండ్రులు విసుగుచెంది మందలించడంతో మనస్థాపం చెందిన రమేశ్ బుధవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. కాగా, చివరగా తన స్నేహితుడికి మేసేజ్ చేసి మొబైల్ ఆఫ్ చేశాడు. దీంతో ఆందోళన చెందిన అతడు రమేశ్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. ఎంతకీ ఫోన్ ఆన్ కాకపోవడంతో కుటుంబీకులు గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు విచారణ ప్రారంభించిన పోలీసులు.. కేసరపల్లి కాల్వ వద్ద రమేశ్ బైక్‌ను గుర్తించారు. ట్యాంక్ కవర్‌లో మొబైల్‌ కూడా ఉంది. దీంతో నదిలో దూకి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. నదిలో గాలింపు చర్యలు మొదలుపెట్టారు.


Next Story