నూతన శకం ప్రారంభమైంది: కేటీఆర్

by  |
నూతన శకం ప్రారంభమైంది: కేటీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: కేసీఆర్ ప్రతిపాదించిన కొత్త రెవెన్యూ చట్టం పై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన ట్వీట్ చేస్తూ.. ‘తెలంగాణ రెవెన్యూ వ్యవస్థలో నూతన శకం ప్రారంభం అవుతున్నది. శతాబ్దాలనాటి చట్టాల బూజు దులుపుతూ… అవినీతి రహిత వ్యవస్థే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన రెవెన్యూ చట్టం ఈ రోజే అసెంబ్లీలో ప్రవేశపెట్టబడుతోంది’ అంటూ వ్యాఖ్యానించారు.

‘కొత్త రాష్ట్రం పొద్దుపొడిచింది.. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని.. ఆరేళ్లుగా సరికొత్త పాలనా సంస్కరణలతో.. పరిపాలనను ప్రజలను మరింతదగ్గర జేసింది.. దశాబ్దాలుగా బూజుపట్టిన చట్టాలను తిరగరాసి.. పారదర్శక పాలనకు పెద్దపీట వేస్తూ.. అవినీతిరహిత వ్యవస్థ కోసం నడుంకట్టి.. జనరంజక పాలనతో ముందుకు సాగుతున్నవేళ..’ అంటూ కేటీఆర్ ట్వీట్ ముగించారు.


Next Story

Most Viewed