హరిత హారంలో మేమే ముందున్నాం….

by  |
హరిత హారంలో మేమే ముందున్నాం….
X

దిశ వెబ్ డెస్క్: ఆరో విడత తెలంగాణ హరిత హారంలో మేడ్చల్ జిల్లా ముందంజలో ఉందని ఆ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. హరిత హారంలో భాగంగా తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని జనచైతన్య పార్కులో సోమవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ….మేడ్చల్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీ ,కార్పొరేషన్లలో అర్బన్ ట్రీ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. అర్బన్ ప్లాంటేషన్ కింద మున్సిపాలిటీల్లో 3 నుంచి 4లక్షల వరకు మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. అయితే జిల్లా లక్ష్యం 63లక్షల మొక్కలు కాగా ఇప్పటికే 70లక్షలకు పైగా మొక్కలు నాటి ముందంజలో ఉన్నట్టు తెలిపారు.


Next Story

Most Viewed