భరించలేక మామిడి చెట్టుకు ఉరేసుకున్నాడు

by  |
భరించలేక మామిడి చెట్టుకు ఉరేసుకున్నాడు
X

దిశ, షాద్‌నగర్: రంగారెడ్డి జిల్లో కడుపు నొప్పితాళలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కేశంపేట మండలం తొమ్మిదిరేకుల గ్రామంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రాజమోని నరేందర్ గౌడ్ (30) గత కొంత కాలంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఈరోజు ఉదయం బావి దగ్గరికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి పొలంలో మామిడి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య స్వాతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కేశంపేట ఎస్ఐ కోన వెంకటేశ్వర్లు తెలిపారు.


Next Story