- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లాలోని కాకి వాగులో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. కంగ్టి మండలం జంగి బి కి చెందిన మంగలి మారుతి అనే వ్యక్తి.. కల్వర్టు దాటుతుండగా కాకి వాగు ఉధృతి ప్రవాహం పెరిగింది. గత రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుండడంతో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఉధృతి పెరగడంతో స్థానికులు కల్వర్టుకు ఇరువైపులా ఆగిపోయారు. అయినప్పటికీ మారుతి కల్వర్టు దాటే ప్రయత్నం చేయడంతో వాగులో కొట్టుకుపోయాడు. మారుతి ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. వంతెన దాటవద్దని సూచించినా వినకుండా మారుతీ ముందుకు వెళ్లి ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నారని స్థానికులు తెలిపారు.
Next Story