కాకి వాగులో వ్యక్తి గల్లంతు..!

by  |
కాకి వాగులో వ్యక్తి గల్లంతు..!
X

దిశ, నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లాలోని కాకి వాగులో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. కంగ్టి మండలం జంగి బి కి చెందిన మంగలి మారుతి అనే వ్యక్తి.. కల్వర్టు దాటుతుండగా కాకి వాగు ఉధృతి ప్రవాహం పెరిగింది. గత రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుండడంతో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఉధృతి పెరగడంతో స్థానికులు కల్వర్టుకు ఇరువైపులా ఆగిపోయారు. అయినప్పటికీ మారుతి కల్వర్టు దాటే ప్రయత్నం చేయడంతో వాగులో కొట్టుకుపోయాడు. మారుతి ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. వంతెన దాటవద్దని సూచించినా వినకుండా మారుతీ ముందుకు వెళ్లి ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నారని స్థానికులు తెలిపారు.


Next Story

Most Viewed