- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. గత నెల 25న ఆయన కరోనా బారిన పడటంతో భోపాల్లోని ఓ ఆస్పత్రిలో చేరారు. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది. దీంతో బుధవారం ఆయన్ను డిశ్చార్జి చేయడగమే కాకుండా, మరోవారం పాటు ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉండాలని వైద్యులు సూచించారు.
ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన సందర్భంగా సీఎం చౌహాన్ వైద్య బృందానికి ధన్యవాదాలు తెలిపారు. వారితో కలిసి ఫొటోలు దిగారు. కొవిడ్ అంత ప్రమాదకారి కాదని, నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రాణాలను హరిస్తుందని వెల్లడించారు. కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని.. చికిత్స తీసుకోవాలని ప్రజలకు ఆయన సూచించారు. కరోనా నివారణకు ప్రతిఒక్కరూ మాస్కులు, భౌతికదూరాన్ని మరువరాదని విజ్ఞప్తి చేశారు. ఇంటికి చేరాక అయోధ్య రామమందిరం భూమిపూజ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా సీఎం చౌహాన్ వీక్షించారు.