బిగ్‌బ్రేకింగ్ : తిరుపతిలో అపశృతి.. భక్తుల పైకి దూసుకెళ్లిన లారీ

by srinivas |   ( Updated:2021-07-17 21:31:16.0  )
tirumala-kalinadaka-routr
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలో అపశృతి నెలకొంది. ఆదివారం ఉదయం ఎస్వీపురం సమీపంలో లారీ బీభత్సం సృష్టించింది. తిరుమలకు కాలినడకన వెళ్తున్న భక్తులపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒక భక్తుడు మృతి చెందగా మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed