ఇవాళ్టి నుంచి పూర్తిస్థాయి లాక్‌డౌన్

by  |
ఇవాళ్టి నుంచి పూర్తిస్థాయి లాక్‌డౌన్
X

దిశ, వెబ్ డెస్క్: కేరళలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దాని కోరలకు చిక్కి ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అధికంగా కేసులు పెరుగుతున్న కేరళ రాజధాని తిరువనంతపురంలో ఇవాళ్టి నుంచి వారం రోజులపాటు పూర్తిస్థాయిలో లాక్ డౌన్ విధించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆ ఆదేశాలను ప్రభత్వాధికారులు అమలు చేస్తున్నారు. తిరువనంతపురానికి వచ్చే రోడ్లన్నీ మూసివేశారు. అత్యవసర సర్వీసులు మినహా అన్నీ బంద్ అయ్యాయి.


Next Story