చేవెళ్లలో కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా : రంజిత్ రెడ్డి

by Disha Web Desk 11 |
చేవెళ్లలో కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా : రంజిత్ రెడ్డి
X

దిశ, తాండూరు : పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా అని చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం తాండూరు పట్టణంలోని విల్లేమున్స్ చౌరస్తా నుండి సాయిపూర్ వరకు చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి బైక్​ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సాయి పూర్ లో ఏర్పాటు చేసిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి మాట్లాడుతూ...రాబోయే ఎన్నికలు అనేవి మన పిల్లల భవిష్యత్తు పై ఆధారపడి ఉన్నాయని అందరూ గ్రహించాలి, మతతత్వ పార్టీ లు ఓట్లు అడగడానికి వస్తున్నారని మతం పేరుతో గుడి పేరుతో ఓట్లు అడిగే వారికి బుద్ధి చెప్పే బాధ్యత ఓటర్ల పై ఉందని అన్నారు.

బిజెపి ప్రభుత్వంలో నిరుద్యోగం పెరిగిందని, పెద్దరికం పెరిగిందని అన్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. తాండూరు పట్టణంలో సాయిపూర్ అంటేనే నాకు కొండంత బలం అని అన్నారు. నా గెలుపు లో సాయిపూర్ కీలక పాత్ర పోషించదని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం గ్యారెంటీ లను అమలు చేస్తున్నామని, ఆరోగ్య శ్రీ లక్ష రూపాయల నుంచి పది లక్షలకు పెంచిన ఘనత రేవంత్ రెడ్డి దక్కిందన్నారు. ఐదు సంవత్సరాలు నేను మీకు అందుబాటులో ఉంటా ,సేవ చేస్తానని నాకు ఎంపీగా రంజిత్ రెడ్డి తోడైతే రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో తాండూర్ మున్సిపల్ నాయకులు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బూత్ కమిటీ సభ్యులు, వార్డు ఇంచార్జిలు ,యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



Next Story

Most Viewed