Divorse: విడాకుల తీసుకున్న తర్వాత ఎవరు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు?

by Prasanna |
Divorse: విడాకుల తీసుకున్న తర్వాత ఎవరు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు?
X

దిశ, ఫీచర్స్ : ఈ మధ్యకాలంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు విడాకులు తీసుకోవడం కామన్ అయిపోయింది. ఇద్దరూ ఉద్యోగాలు చేయడంతో నువ్వు ఎక్కువ, నువ్వు తక్కువ అన్న దగ్గర సమస్యల వచ్చి విడిపోతున్నారు. రోజు రోజుకి డివోర్స్ లు తీసుకునే సంఖ్య పెరిగిపోతుంది. తాజాగా హార్దిక్ నటాషా విడాకులు వార్త దేశమంతటా చర్చించుకుంటున్నారు. అసలు డివోర్స్ తీసుకున్న తర్వాత ఎవరు ఎక్కువగా నష్టపోతున్నారనే విషయంపై నిపుణులు షాకింగ్ నిజాలు బయట పెట్టారు.

విడాకులు తీసుకున్న తర్వాత పిల్లలకే ఎక్కువ నష్టం అని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే విడిపోయాక ఎవరికి వారు పర్సనల్ లైఫ్ లో ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు మాత్రం అటు అమ్మ దగ్గరకు వెళ్లాలా ? ఇటు నాన్న దగ్గరికి వెళ్లాలా అని ఆలోచిస్తూ డిప్రెషన్ లోకి వెళ్తున్నారు. పెళ్లి చేసుకోవద్దని ఎవరూ చెప్పడం లేదు.. చేసుకుని పిల్లలను పట్టించుకోకవడం తప్పు అని నిపుణులు అంటున్నారు.

ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు కలిసి కాపురం చేయలేక పోతున్నారు. అలాంటప్పుడు ప్రేమించడం దేనికి అని ప్రశ్నిస్తున్నారు. పెళ్లి చేసుకుని ముగ్గురిని బాధ పెట్టె కన్నా చేసుకోకపోవడమే మంచిదని సలహా కూడా ఇస్తున్నారు. ప్రేమ మీద నమ్మకం ఉంది పెళ్లి మీద లేదు అని విడాకులు తీసుకున్న ప్రతీ జంట నిరూపించారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Advertisement

Next Story

Most Viewed