Viral : ఓర్నీ.. మందేసి చోరికి వచ్చిన దొంగ.. మర్చిపోయి అక్కడే కునుకు తీయడంతో..

by Javid Pasha |
Viral : ఓర్నీ.. మందేసి చోరికి వచ్చిన దొంగ.. మర్చిపోయి అక్కడే కునుకు తీయడంతో..
X

దిశ, ఫీచర్స్ : ఏదైనా ప్రయత్నంలో విఫలమైనప్పుడు తెలివి తెల్లారినట్లుంది అంటుంటారు వెటకారంగా.. సరిగ్గా అటువంటి సన్నివేశాన్ని గుర్తు చేసే న్యూస్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ ఇంట్లో దొంగతనం చేయాలని భావించిన వ్యక్తి, మామూలుగా రాకుండా ఫుల్లుగా మందేసి వచ్చాడు. అంతా సర్దుకున్నాక మర్చిపోయి అక్కడే కునుకు తీయడంతో పోలీసులకు పట్టుబడ్డాడు. ఆ దొంగ చేసిన పనికి అందరూ నవ్వుకోవడంతోపాటు ‘పాపం మంచి దొంగలా ఉన్నాడు’ అంటూ సెటైరికల్‌గా రియాక్ట్ అవుతున్నారు.

ఈ విచిత్ర సంఘటన ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో గల ఘాజీపూర్ పోలీస్ పరిధిలో జరిగింది. ఇందిరా నగర్ సెక్టార్-20లో గల సునీల్ పాండే అనే వైద్యుడి ఇంట్లో దొంగతనం చేయాలని డిసైడ్ అయిన దొంగ అదే రోజు రాత్రి ఫుల్లుగా మద్యం సేవించి చోరీకి వచ్చాడు. అయితే మద్యం మత్తులో ఉన్న అతను సామాన్లు సర్దుకుంటూ నిద్రముంచుకు రావడంతో అక్కడి పడుకున్నాడు. మరుసటి రోజు ఇల్లు తెరిచి ఉండటం, సామాన్లు చెల్లా చెదురుగా కనిపించడం, అక్కడే ఓ వ్యక్తి పడుకొని ఉండటం గమనించిన చుట్టు పక్కలవారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో నిద్ర మేల్కొన్న దొంగ తన చుట్టూ ఉన్న పోలీసులను చూసి ఒక్కసారిగా షాక్ తిన్నాడు. చేసేదిలేక వారికి లొంగిపోయాడు. ప్రజెంట్ ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుండగా ‘పాపం దొంగ..’ అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

Advertisement

Next Story

Most Viewed