ఉప్పు ఎక్కువగా తింటున్నారా.. గుండె మాత్రమే కాదు ఈ అవయవాలు కూడా ప్రమాదంలో పడ్డట్టే..

by Sumithra |
ఉప్పు ఎక్కువగా తింటున్నారా.. గుండె మాత్రమే కాదు ఈ అవయవాలు కూడా ప్రమాదంలో పడ్డట్టే..
X

దిశ, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్: ఉప్పు ఎక్కువగా తిన్నవారిలో రక్తపోటు వచ్చే అవకాశాలు అధికంగా కనిపిస్తుంది. అలాంటి వారిని వైద్యనిపుణులు ఉప్పు తక్కువగా తినమని సూచిస్తుంటారు. అలాగే తక్కువ రక్తపోటు ఉన్నవారిని కాస్త ఎక్కువ ఉప్పు తినమని సలహా ఇస్తారు. మోతాదుకు మించి ఉప్పును తిన్నట్టయితే అధిక రక్తపోటు, గుండె ఆరోగ్యానికి ప్రమాదకరమంటున్నారు నిపుణులు. అందుకే ఉప్పును నిర్ణీత పరిమితిలో తినమని సలహా ఇస్తారు. ఎక్కువ ఉప్పు గుండెతో పాటు మూత్రపిండాల పై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుంది.

అధిక ఉప్పు గుండెను మాత్రమే కాకుండా మూత్రపిండాలను కూడా దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు. నిజానికి, అదనపు ఉప్పు మూత్రంలో కాల్షియం మొత్తాన్ని పెంచుతుంది. దీని వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. రాళ్లే కాకుండా, అదనపు ఉప్పు మూత్రంలో ప్రోటీన్ మొత్తాన్ని పెంచుతుంది. దీని వల్ల కిడ్నీ సామర్థ్యం దెబ్బతింటుంది. ఇది కిడ్నీ దెబ్బతినే ప్రమాదాన్ని పెంచుతుంది. అందువల్ల ఒక వ్యక్తి రోజుకు 5 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తినకూడదని నిపుణులు చెబుతున్నారు.

తక్కువ నీరు తాగడం హానికరం..

ఎక్కువ ఉప్పు కిడ్నీ ఆరోగ్యాన్ని పాడు చేసినట్లే, తక్కువ నీరు తాగడం వల్ల కూడా కిడ్నీ ఆరోగ్యానికి హాని కలుగుతుందని కిడ్నీ నిపుణులు చెబుతున్నారు. నీళ్లు తాగడం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. కిడ్నీలో పేరుకుపోయిన టాక్సిన్స్ మొత్తం తొలగిపోతాయి. అలాగే ఎక్కువ నీరు తాగడం వల్ల యూరిక్ యాసిడ్ అధికంగా ఏర్పడకుండా చేస్తుంది. రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అందువల్ల మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వీలైనంత ఎక్కువ నీరు త్రాగటం మంచిది.

పెయిన్ కిల్లర్స్ తో కిడ్నీకి హాని..

ఇవన్నీ కాకుండా కిడ్నీలకు ఏదైనా గరిష్ఠంగా హాని కలిగిస్తున్నాయంటే అవి పెయిన్ కిల్లర్స్. ఈ రోజుల్లో ప్రజలు వైద్యుల సలహా లేకుండా ఎలాంటి నొప్పికైనా కౌంటర్ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటుంటారు. ఈ పెయిన్‌కిల్లర్లు మీకు నొప్పి నుండి తక్షణ ఉపశమనాన్ని అందిస్తాయి. అయితే వాటి ఉపయోగం మీ కిడ్నీ ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుంది. అందుకే వైద్యుల సలహా లేకుండా పెయిన్ కిల్లర్ తీసుకోకూడదని అంటారు.

మూత్రపిండాలను ఎలా రక్షించుకోవాలి..

మధుమేహం మూత్రపిండాల పై చెడు ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు మూత్రపిండాల పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

స్వీట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీకి కూడా హాని కలుగుతుంది. అందుకే స్వీట్లు తీసుకోవడం తగ్గించండి.

ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల కూడా కిడ్నీలు దెబ్బతింటాయి కాబట్టి తగ్గించడం మంచిది.

వీలైనంత ఎక్కువ నీళ్లు తాగాలి.

నొప్పి నివారణ మందులు ఎక్కువగా తీసుకోవద్దు.

తగినంత నిద్ర పోవాలి. రోజూ 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి.

ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను తీసుకోవద్దు.

మీ బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. అలాగే ప్రతిరోజూ వ్యాయామం చేయండి.

ఒత్తిడిని నిర్వహించడానికి, ధ్యానం, యోగా చేయడం మంచిది.

Next Story

Most Viewed