రోడ్డుపై వరినాట్లు

by  |
రోడ్డుపై వరినాట్లు
X

దిశ, మెదక్: జిల్లా కొల్చారం మండల కేంద్రంలో ఎస్సీ కాలనీవాసులు శుక్రవారం రోడ్డుపై వరినాట్లు వేసి నిరసన తెలిపారు. స్థానిక నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి సీసీ రోడ్డు నిర్మాణానికి రూ .10 లక్షల నిధులు మంజూరు చేసినప్పటికీ స్థానిక నాయకుల నిర్లక్ష్యంతో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టలేదు. దీంతో వర్షాలకు రోడ్డు బురదగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో నిరసనగా రోడ్డుపై వరినాట్లు వేశారు.


Next Story

Most Viewed