బ్యాట్స్‌మెన్ వైఫల్యం వల్లే..

by  |
Virat Kohli
X

రెండో టెస్ట్‌లో బ్యాట్స్‌మెన్ ఘోర వైఫల్యం వల్లే ఓటమి చెందామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. మ్యాచ్ అనంతరం కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. రోహిత్ లేకపోవడం, తాను పరుగులు చేయలేకపోవడంతో జట్టు భారీ మూల్యం చెల్లించిందన్నారు. బౌలర్లు రాణించినా, బ్యాట్స్‌మెన్ సరిగ్గా ఆడకపోవటం దురదృష్టకరమన్నాడు. కాగా, రెండో టెస్ట్‌లోనూ భారత్ 7 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ బ్యాట్స్‌మెన్, బౌలర్లు రాణించినా రెండో ఇన్నింగ్స్‌లో చేతులెత్తేశారు. దీంతో కివీస్ సునాయాసంగా విజయం సాధించింది.


Next Story

Most Viewed