దారుణం: వాట్సప్ స్టేటస్ పెట్టినందుకు కత్తితో దాడి

by srinivas |
దారుణం: వాట్సప్ స్టేటస్ పెట్టినందుకు కత్తితో దాడి
X

దిశ, ఏపీ బ్యూరో: ఇద్దరు స్నేహితుల వాట్సాప్ స్టేటస్ చిచ్చుపెట్టింది. వాట్సాప్ స్టేటస్ పెట్టినందుకు తన స్నేహితుడి కుటుంబంపై ఓ యువకుడు దాడి చేశాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా నూజివీడు మండలం లీలానగర్ కాలనీలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం దుర్గాప్రసాద్, వరప్రసాద్ స్నేహితులు. వీరిద్దరు కలిసి గతంలో సెల్ఫీ దిగారు. దానిని మంగళవారం దుర్గాప్రసాద్ తన వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకున్నాడు. దానిని చూసిన వరప్రసాద్ తన స్నేహితులను తీసుకోని దుర్గాప్రసాద్ ఇంటికి వచ్చి గొడవ పడ్డాడు. అనంతరం కత్తులతో దాడి చేశాడు.

అడ్డుకున్న కుటుంబ సభ్యులపైనా విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో దుర్గాప్రసాద్‌ తీవ్ర గాయాలపాలయ్యాడు. అతడితో పాటు ఇంట్లో ఉన్న మరో ఇద్దరిని కూడా గాయపరిచారు. అనంతరం అక్కడి నుంచి వరప్రసాద్ పరారయ్యాడు. దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. వరప్రసాద్, అతడి స్నేహితుల కోసం గాలిస్తున్నారు.

Advertisement

Next Story