యాదాద్రి జిల్లాలో మోకాళ్ల లోతు గుంతలు

by  |
యాదాద్రి జిల్లాలో మోకాళ్ల లోతు గుంతలు
X

దిశ, తుంగతుర్తి: యాదాద్రి జిల్లా మోత్కూరు పట్టణం నుండి రాయిగిరి వరకు ఉన్న డబుల్ రోడ్ ను వెంటనే మరమ్మతులు చేయాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు బయ్యని రాజు డిమాండ్ చేశారు. శుక్రవారం ఈ విషయం ఆయన పత్రికా ప్రకటన చేశారు. రోడ్డు మరమ్మతుల విషయం గురించి జిల్లా కలెక్టర్ కు కూడా లేఖ రాసినట్లు ఆయన చెప్పారు. రాయగిరి మోత్కూరు రోడ్డులో మోకాళ్ళ లోతు గుంతలు ఏర్పడడంతో ప్రయాణం చేయాలంటే నరకప్రాయంగా ఉందన్నారు. వెంటనే ఆర్అండ్ బీ శాఖ అధికారులను ఆదేశించి మరమ్మతులు చేయించాలని, లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామన్నారు.


Next Story

Most Viewed