ఆ ఇద్దరితో సంబంధం లేదు..!

by  |
ఆ ఇద్దరితో సంబంధం లేదు..!
X

దిశ, వెబ్‎డెస్క్: నటుడు సుశాంత్ సింగ్ రాజ్‎పుత్ మరణం తర్వాత సినీ ఇండస్ట్రీపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా బాలీవుడ్‎లో డ్రగ్స్ వ్యవహారం బయటకు వచ్చింది. తాజాగా బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్‎ పేరు తెరపైకి వచ్చింది.

డ్రగ్స్ కేసులో ఎన్‎సీబీ గుర్తించిన క్షితిజ్ ప్రసాద్, అనుభవ్ చోప్రా.. కరణ్‎కు సన్నిహితులు అని మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై కరణ్ జోహార్ ఓ స్టేట్‎మెంట్‎ను విడుదల చేశారు. తనకు ఇద్దరితో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.'ధర్మా ప్రొడక్షన్స్ సంస్థలో అనుభవ్ చోప్రా.. 2011-12 మధ్య కాలంలో కేవలం రెండు నెలలు మాత్రమే పనిచేశాడని తెలిపారు. క్షితిజ్ ప్రసాద్ తమ సంస్థలో ఓ ప్రాజెక్టు కోసం గతేడాది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా జాయిన్ అయ్యాడు. అయితే ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదని చెప్పారు. అంతకుమించి ఆ ఇద్దరు వ్యక్తులతో, వాళ్ల వ్యక్తిగత జీవితాలతో తనకు , ధర్మ ప్రొడక్షన్స్‌కు ఎలాంటి సంబంధమూ లేదని కరణ్ పేర్కొన్నారు. ఇక తాను ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని.. డ్రగ్ డీలర్స్ ఎవరితోనూ సంప్రదింపులు జరపలేదని అన్నారు.


Next Story

Most Viewed