బోగత జలపాతం పర్యటనలో కడియం ఫ్యామిలీ..

by Shyam |
బోగత జలపాతం పర్యటనలో కడియం ఫ్యామిలీ..
X

దిశ, వాజేడు : ములుగు జిల్లా వాజేడు మండలంలో తెలంగాణ మినీ నయాగర జలపాతంగా పిలువబడి బోగత జలపాతాన్ని మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆదివారం సందర్శించారు. కుటుంబ సమేతంగా కలిసి బోగత జలపాతం సందర్శించి ఆనందాన్ని వ్యక్తం చేశారు. బోగత జలపాతం ఎంతో అద్భుతంగా ఉందని ఇంతటి అద్భుతమైన బోగత జలపాతం నయాగరా జలపాతంగా ఉందని ఆయన కొనియాడారు. బోగత జలపాతం ప్రాంగణాన్ని కలియతిరిగి ఆహ్లాదాన్ని పొందుతూ ఆనందం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో కడియం శ్రీహరికి బోగత జలపాతం గురించి టూరిజం శాఖ అధికారి సుమన్ వివరించారు. కడియం పర్యటన నేపథ్యంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వాజేడు ఎస్ఐ తిరుపతిరావు ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత చర్యలు ఏర్పాటు చేశారు. ఆయన వెంట వాజేడు మండల టీఆర్ఎస్ అధ్యక్షులు పెనుమల్ల కృష్ణారెడ్డి, అధికార ప్రతినిధి చెన్నం ఎల్లయ్య, కో ఆప్షన్ సభ్యులు నిజాముద్దీన్ ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed