కొండచరియ విరిగిపడి ఐదుగురు మృతి

by Shamantha N |   ( Updated:2020-03-11 01:14:22.0  )
కొండచరియ విరిగిపడి ఐదుగురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: ఇంటిపై కొండ చరియ విరిగిపడి ఐదుగురు మృతి చెందిన ఘటన జమ్మూకాశ్మీర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. ఉధమ్‌పూర్ జిల్లాలోని బర్మాన్ అనే ఊరిలో ఓ ఇంటిపై కొండచరియ విరిగిపడింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న ఐదుగురు మృతి చెందారు. ఒకరు గాయపడ్డారు. మృతిచెందినవారిలో నలుగురు చిన్నారులున్నారు. స్థానికులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కొండచరియ కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీశారు. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Next Story

Most Viewed