వెనక్కి తగ్గేది లేదు.. మే 5 నుంచే ఇంటర్ పరీక్షలు

by srinivas |
వెనక్కి తగ్గేది లేదు..  మే 5 నుంచే ఇంటర్ పరీక్షలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో మే 5 నుంచి ఇంట‌ర్ ప‌రీక్షలు నిర్వహించేందుకు స‌న్నాహాలు మొదలయ్యాయి. మ‌రో రెండ్రోజుల్లో వెబ్‌సైట్‌లో ఇంట‌ర్ హాల్‌టిక్కెట్లను అందుబాటులో ఉంచనున్నారు. కరోనా ప్రతాపం క్రమంలో పరీక్షలను వాయిదా వేయాలని ప్రతిపక్ష పార్టీల నుంచి డిమాండ్లు వస్తున్నా.. పరీక్షలు నిర్వహించేందుకే ప్రభుత్వం ముందడుగు వేసింది. కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతోంది.

ఈ మేరకు ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ప్రత్యేక కోవిడ్ ప్రొటోకాల్ ఆఫీసర్‌ను నియమించనుంది. అలాగే ఐసోలేషన్ వార్డు ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు పరీక్షల కేంద్రాల వద్ద విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటించేలా పోలీసులు చర్యలు తీసుకోనున్నారు. కాగా మే 5 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed