భారత్ భద్రతే ముఖ్యం : శ్రీలంక

by  |
భారత్ భద్రతే ముఖ్యం : శ్రీలంక
X

దిశ, వెబ్ డెస్క్ :శ్రీలంక విదేశాంగ శాఖ కార్యదర్శిగా అడ్మిరల్ జయనాథ్ కొలంబగే నియామకం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండియాకు పెద్ద పీట వేయాలన్నదే తమ నూతన విదేశాంగ విధానమని ప్రకటించారు. తమ దేశంలో చైనా ప్రాబల్యం పెరుగుతోందన్న ఆందోళన నేపథ్యంలో ‘భారత్ భద్రతే ముఖ్యమని’ కొలంబగే స్పష్టంచేశారు.

ప్రెసిడెంట్ గొటబయ రాజపక్స ఈ నెల 14న కొలంబగేను విదేశాంగ శాఖ కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. కాగా, ఈయన 2012-14 మధ్య కాలంలో శ్రీలంక నావికా దళం చీఫ్‌గా పనిచేసిన అనుభవం ఉంది.

అడ్మిరల్ కొలంబగే బుధవారం ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. శ్రీలంక నూతన విదేశాంగ విధానం గురించి వివరించారు. ‘భారత దేశానికి పెద్ద పీట’ వేయాలన్నదే శ్రీలంక నూతన ప్రాంతీయ విధానమని ప్రకటించారు. భారత్ భద్రతా ప్రయోజనాలకు హానికరమైన వాటిని శ్రీలంక చేయదని మరోసారి స్పష్టం చేశారు.


Next Story

Most Viewed